సమీప భవిష్యత్తులోనే ప్రపంచంలో 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే లక్ష్యంతో భారత్ వివిధ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటోంది.
ఈ క్రమంలో ఐరోపా స్వేచ్ఛాయుత వాణిజ్య సంగం (ఎఫ్టా) తో ఇటీవల ఒప్పందం కుదిరింది. (4 దేశాలతో). “ఎఫ్టా” ఒక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. ఇది ఐరోపా సమాఖ్య (EU) కు భిన్నమైనది.
ఎఫ్టా లోని సభ్య దేశాలు :- 1. స్విట్జర్లాండ్, 2. ఐస్ లాండ్, 3. నార్వే, 4. లిక్టన్ స్టెన్ – VADUZ (కరెన్సీ CRONA)
దీనివల్ల దేశంలో వర్తక వృద్ధి, ఉపాధి అవకాశాలు విస్తృతమవుతాయి.
గత 10 సం|| లో భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 10 స్థానం నుండి 5 స్థానంకు ఎగబాకింది.
“ఎఫ్టా” తో పందానికి భారత్ 2008 నుంచి ప్రయత్నాలు చేస్తోంది.
ఇంతవరకు “ఎఫ్టా” ఒప్పందాలు చేసుకున్న దేశాలు:-
చైనా, కెనడా, దక్షిణ కొరియా (వంటి 40 దేశాలతో 29)
“ఎఫ్టా” దేశాలకు 2022 నుంచి 2023లో భారత్ ఎగుమతుల విలువ – 192 కోట్ల డాలర్లు.
“ఎఫ్టా” దేశాలకు భారత్ ఎక్కువగా ఎగుమతి చేసేవి :- రసాయనాలు, రత్నాలు, వజ్రాలు, ఔషధాలు, బోట్లు, నౌకలు, దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు.
2000 ఏప్రిల్ – 2023 డిసెంబర్ మధ్య భారత్ కు స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన FDI లు – 1000 కోట్ల డాలర్లు.
భారత్ లో 12వ అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారు – స్విట్జర్లాండ్.
తాజా ఒప్పందం వల్ల భారత్ నుంచి సుంకాలు విధించనివి :- చేపలు, మాంసం, వంట నూనెలు, శుద్ధి చేసిన ఆహార ఎగుమతులు.
“ఎఫ్టా” దేశాల్లో భారత్ కు బలమైన వాణిజ్య బంధం గల దేశాలు :- స్విట్జర్లాండ్, నార్వే.
అంతర్జాతీయ “నవీకరణ సూచీ” లో ఆది నుంచి అగ్రస్థానంలో నిలుస్తున్న – స్విట్జర్లాండ్ .
గత (2023 – 24) ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి స్విట్జర్లాండ్ కు జరిగిన ఎగుమతులు :- 134 కోట్ల డాలర్లు; దిగుమతులు:- 1,579 కోట్ల డాలర్లు.
స్విట్జర్లాండ్ నుంచి భారత్ కు దిగుమతి అవుతున్నవి :-