హైదరాబాద్ చుట్టుప్రక్కల మూసి నీటితో సాగైనా కూరగాయల్లో ప్రమాదకర ఆర్సినిక్, క్యాడ్మియం, లెడ్ వంటి విష వ్యర్ధాలు పోగు పడినట్లు గత అధ్యాయనాలు వెల్లడించాయి.
బెంగళూరు, భోపాల్, వారణాసి నగరాల చుట్టుప్రక్కల కలుషిత జలాలతో పండించిన బీన్స్, కొత్తిమీర, పాలకూర, వంకాయ వంటి వాటిలో భారలోహాల ఆనవాళ్లు పరిమితికి మించి వెలుగు చూశాయి.
వాటి వల్ల క్యాన్సర్ల ముప్పు పెచారిల్లుతోంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో కాలుష్యానికి నెలవులైన చెరువుల నీటితో కూరగాయలు, ఆకుకూరలు సాగును నిలువరించాలని తెలంగాణ హైకోర్టు తాజాగా ఆదేశించింది.
ఇండియాలో 323 నదులకు సంబంధించిన 351 ప్రవాహ ప్రాంతాలు కాలుష్యమయమైనట్లు అధికార గరంకాల వెల్లడి.
పశు కళేబరాలు, మృతదేహాలు, క్రిమిసంహారకాలు పోటేత్తడంతో జీవ నదులు నిర్జీవమవుతున్నాయి.