2022 నాటి ప్రపంచ అడవుల స్థితిగతుల నివేదిక ప్రకారం 1990 – 2020 మధ్యలో 104 కోట్ల ఎకరాల అడవులు కనుమరుగయ్యాయి.
ప్రపంచ అటవీ విస్తీర్ణంలో తరిగిపోయిన శాతం – 10%.
(మార్చి 21) అంతర్జాతీయ అటవీ దినోత్సవం.
2010 – 2020 మధ్య అత్యధికంగా అటవీ నష్టం జరిగినది దక్షిణ అమెరికా, ఆఫ్రికాల్లోనే…!
ఇండియా “అటవీ స్థితిగతుల నివేదిక – 2021” ప్రకారం దేశంలో దట్టమైన అడవులు పెరిగినప్పటికీ మధ్యస్థ సాంద్ర అడవులు క్షీణించాయి.
దేశంలో కార్చిచ్చులకు గురవుతున్న అడవులు – 35%.
కార్చిచ్చుల ముప్పు అధికంగా ఉన్న ప్రాంతాలు :- ఈశాన్య ప్రాంతాలు, పశ్చిమ మహారాష్ట్ర, దక్షిణ ఛత్తీసగఢ్; మధ్య ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్; తెలంగాణ మొదలగునవి.
ప్రపంచవ్యాప్తంగా 90% అడవుల నష్టానికి వ్యవసాయ విస్తరణే కారణం..!
వ్యవసాయేతర కార్యకలాపాల కోసం అమెజాన్ అడవులు నిర్మూలనకు గురవుతున్నాయి.
దక్షిణ అమెరికాలోని వర్షారణ్యాలు అమెరికా వర్షపాతంపై ప్రభావం చూపుతాయని, ఆగ్నేయాసియా అడవులు, ఆగ్నేయ ఐరోపా, చైనాల వర్షపాత సరళిని ప్రభావితం చేస్తాయని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
అడవులకు నష్టం వాటిల్లడం వల్ల స్థానికంగా, ప్రాంతీయంగా ఉష్ణోగ్రత, వర్షపాతాల మీద గణనీయ ప్రభావం ఉంటుంది.
దక్షిణ బ్రెజిల్ అమెజాన్ ప్రాంతంలో అటవీ నష్టం కారణం గా వర్షపాతం తగ్గడంతో 2050 వరకు ఏటా 100 కోట్ల డాలర్లకు పైగా పంట నష్టం, సోయాబీన్ దిగుబడి తగ్గుదల పశు సంపద నష్టం చోటు చేసుకుంటుందని అంచనా..!
ఇటీవల కాలంలో పెచ్చరిల్లుతున్న వాతావరణ మార్పులు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నవి.
ఈ మార్పులు కార్చిచ్చులు, తెగుళ్లకు దారితీస్తున్నాయి.
ఒక అధ్యయనం ప్రకారం – 2003 -18 మధ్యకాలంలో 29% నుంచి 37% దాకా అడవులు కార్చిచ్చుల బారిన పడ్డాయి.
ప్రపంచవ్యాప్తంగా 2021లో కార్చిచ్చుల వల్ల వృక్ష సంపద కు కలిగిన నష్టం – 2.22 కోట్లు.
అడవులు కర్బనాన్ని నిక్షిప్తం చేయడంతో పాటు సూర్యకాంతిని, వాతావరణం లో నీటి ఆవిరిని ప్రభావితం చేస్తాయి.
అంతేకాక, వేసవిలో వృక్షాలు భూపరితల ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి.
జనాభా పెరుగుదల, అటవీ ప్రాంతాల్లోకి మానవ కార్యకలాపాలు విస్తరించడం, అడవులు దెబ్బతినడం వంటి కారణాలతో మనుషులు, వన్యప్రాణుల మధ్య సాహచర్యం పెరుగుతోంది.
ఫలితంగా” బ్యూబోనిక్” ప్లేగు, సార్స్, COVID – 19 వంటి జంతు సంబంధిత వ్యాధులు రవళి మానవ మనుగడకు పెద్ద సవాలు గా మారుతోంది.
1960 నుంచి బయటపడిన వ్యాధుల్లో 30% పైగా భూ వినియోగంలో మార్పులు, ముఖ్యంగా అడవుల నరికివేత, వంటివే కారణం..!
కొత్తగా ఉద్భవిస్తోన్న 250 సాంక్రమిక వ్యాధుల్లో 15% కి అడవుల నష్టమే కారణమని ఒక అధ్యయన నివేదిక.
2014 – 16 మధ్యకాలంలో “ఎబోలా” పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాల్లో వేల మంది మరణానికి కారణమైంది.
2030 నాటికి అడవి నష్టాన్ని, భూ క్షీణతను నిలువరించడానికి కృషి చేస్తామంటూ “COP – 26”, “వాతావరణ సదస్సు” సందర్భంగా 141 దేశాలు సంయుక్త ప్రకటన చేశాయి.
ఇందుకోసం అటవీ నష్టాన్ని అడ్డుకోవడం అటవీ నిర్వహణ క్షీణించిన భూముల పునరుద్ధరణ, వ్యవసాయ ఆధారిత అడవుల పెంపకాన్ని విస్తరించడం, అడవుల సుస్థిర వినియోగం వంటి మార్గాలను లక్షించారు.